డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి
కాకతీయ, రామకృష్ణాపూర్ : పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో నెలకొన్న సమస్యలను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సత్వరమే పరిష్కరించాలని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి డిమాండ్ చేశారు. స్థానిక ఒకటో వార్డు పరిధిలో నిర్మించిన 286 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత,కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. కనీస మంచి నీటి,విద్యుత్,డ్రైనేజీ సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఎవరు ఇండ్లలో ఉండడం లేదన్నారు. ఎవుగా పెరిగిన పిచ్చి మొక్కలతో విష సర్పాలు,దోమలకు నిలయంగా మారిందన్నారు. తక్షణమే మంత్రి వివేక్,మున్సిపల్,అర్&బీ అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజా రమేష్, సుదర్శన్ గౌడ్,కుమార్,మల్లయ్య,శ్రీనివాస్,లక్ష్మణ్,ఓదెలు,మహేష్,అనిల్ రావు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.


