పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి
కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం,గ్రామ స్థాయిలో ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా అన్టైడ్ ఫండ్ ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వెంటనే పరిష్కరించడమే విలేజ్ హెల్త్ శానిటేషన్,న్యూట్రిషన్ కమిటీ ప్రధాన లక్ష్యంమని నవాబుపేట గ్రామ సర్పంచ్ గూళ్ల రజిత రాజు తెలిపారు.మండలంలోని నవాబుపేట గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో బుధవారం వి హెచ్ ఎస్ ఎన్ సి మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ రజిత రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పకుండా గర్భిణీలకు, బాలింతలకు,పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్వాడి సెంటర్లో పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని,గర్భవతులు బాలింతల సంక్షేమంతో పాటు పోషకాహారం అందిస్తున్నారని ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్వాడి సెంటర్లకు పంపించాలని కోరారు. అనంతరం పౌష్టికాహారం,బాలామృతంను పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ ప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి బడుగు సంపత్,అంగన్వాడీ టీచర్లు కవిత,నిర్మల,రేణుక,మహిళా సంఘం సిఎలు శారద,రజిత సరిత,ఏఎన్ఎం,ఆశ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.


