వ్యక్తిగత కారణాలతో బిఆర్ యస్ పార్టీకి భూమయ్య గుడ్బై..
కాకతీయ, వేములవాడ : రుద్రంగి మండలంలోని మానాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, మాజీ వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి రాజీనామా చేశారు. 2019 నుంచి ప్రజా ప్రతినిధిగా సేవలందించిన ఆయన, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వాన్ని విడిచిపెట్టినట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను బాల్కొండ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి వాట్సాప్ ద్వారా పంపినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన భూమయ్య రాజీనామా స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


