epaper
Tuesday, April 7, 2026
epaper

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?
500 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకల సమస్య
ఏళ్లుగా ఎదురుచూపులు.. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు
ఎన్నిక‌ల వాగ్దానంగా మిగులుతున్న బ్రిడ్జి నిర్మాణం

కాకతీయ,శంకరపట్నం : మండలంలోని కేశవపట్నం గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న నాయకులు, తర్వాత మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మల్లెపచ్చం వాగు అవతల వైపున దాదాపు 500 ఎకరాలకు పైగా సస్యశ్యామల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు చేరుకోవాలంటే తప్పనిసరిగా వాగును దాటాల్సిందే. అయితే వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రైతులు తమ పొలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు ఆలస్యం కావడం, కోతల సమయంలో నష్టం కలగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు.

వర్షాల్లో నరకయాతన..

ప్రతి వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగు దాటడం ప్రమాదకరంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు సైదాపూర్ రోడ్డుమార్గం ద్వారా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా కావడమే కాకుండా, ఆటోలు అద్దెకు తీసుకోవాల్సి రావడంతో అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.

వాగ్దానాలకే పరిమితమైన నాయకులు..

ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణంపై హామీలు ఇచ్చినా, వాటి అమలు మాత్రం జరగలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో కమలాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ, శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని గ్రామస్తులు గుర్తుచేశారు. పలుమార్లు అధికారులు కూడా పరిశీలించినా, పనులు మాత్రం ప్రారంభం కాలేదని అంటున్నారు.

సాంక్షన్ అయినా పనులు ఎందుకు నిలిచాయి?

టీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిధుల కొరతనా? లేక పరిపాలనా నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుత మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కప్పంపల్లి సత్యనారాయణ స్పందించి వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభమవడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు వేగవంతం అవుతాయని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణాన్ని తక్షణం ప్రారంభిస్తుందా? లేక మరోసారి హామీలకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వచ్చి రాగానే వసూళ్ల పర్వం..!

వచ్చి రాగానే వసూళ్ల పర్వం..! జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్ అధికారి...

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ...

ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి

ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి 5% తగ్గింపుతో పన్నులు చెల్లించాలని పిలుపు పౌరులకు...

ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ

ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ రైతుల సమస్యతో అధికారుల ముందుకు లంబాడిపల్లెలో ధాన్యం...

తండ్రే హంత‌కుడు

తండ్రే హంత‌కుడు కవల పిల్ల‌ల హ‌త్య కేసును చేధించిన పోలీసులు ఆస్తిపై మోజు.. మగపిల్లాడు...

భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వర స్వామి ఆలయం

భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వర స్వామి ఆలయం పూజా కార్యక్రమాల్లో భక్తుల ఉత్సాహం అన్నపూజలు, హోమాలు,...

కార్పొరేటర్లకు ఘ‌నంగా స‌న్మానం

కార్పొరేటర్లకు ఘ‌నంగా స‌న్మానం బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ,...

జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం

జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img