epaper
Tuesday, April 7, 2026
epaper

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు
సీఎం విజిట్ పేరుతో హడావిడిగా మొక్క‌జోన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు
15 రోజులైనా ఒక్క కిలో కూడా కొన‌లేదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం

కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి గోడును విన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నర్మెట గ్రామంలో సీఎం విజిట్ ఉందని చెప్పి హడావిడిగా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్రం ప్రారంభించి 15 రోజులు దాటినా ఇప్పటివరకు ఒక్క కిలో కూడా మొక్కజొన్న కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బడ్జెట్ సమావేశాల్లోనే మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు వస్తాయని ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు.మొక్కజొన్న విక్రయ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ తరఫున ప్రదర్శన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.సమస్యపై మాట్లాడేందుకు అవకాశం అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. జీరో అవర్, బడ్జెట్ చర్చల్లో మాట్లాడితే సీఎం వస్తున్నారు.. కేంద్రం ప్రారంభమైందని ప్రభుత్వం సమాధానం చెప్పిందని,నేను ఉన్నా లేకున్నా పరవాలేదు..రైతులకు నష్టం జరగకూడదని స్పష్టం చేసారు. అకాల వర్షాలు పడుతున్నా. పగటి పూట కోతుల భాధ, రాత్రి పూట అడవి పందుల భాధతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.రైతులు ఈ సమస్యలన్నింటిని తట్టుకొని పడిగాపులు కాస్తున్నారని అన్నారు.ఈ పరిస్థితి వివరించడంతోనే హడావిడిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కొనుగోళ్లు జరగలేదని మండిపడ్డారు.
కొనుగోలు మొదలు పెట్టకపోతే రైతులు కేంద్రాలకు రావడం లేదన్నారు.రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం చాలా కష్టంగా మారుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2400 మద్దతు ధరతోనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.13, 14 శాతం తేమ నిబంధనల ప్రకారం మొక్కజొన్న కొనాలని అధికారులకు సూచించారు.వెంటనే భరదన్ విడుదల చేసి కొనుగోలు ప్రారంభించాలని అన్నారు. ఈసారి నీటి సమస్య కారణంగా రైతులు వరి బదులు మొక్కజొన్న పంట వేశారని, తపస్ పల్లి రిజర్వేయర్ నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో మొక్కజొన్న సాగు పెరిగిందని తెలిపారు.ప్రస్తుతం మొక్కజొన్న కోతకు వచ్చిందని,ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని పైర్ అయ్యారు.చేర్యాల పాత డివిజన్ పరిధిలో నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట ప్రాంతాల నుంచి ప్రైవేట్ మార్కెట్ వ్యాపారులు వచ్చి దోపిడీ చేసే పరిస్థితి ఉంటుందన్నారు. లోకల్ రైతులను ఇష్టం వచ్చినట్లు ఇబ్బంది పెట్టడం జరుగుతోందన్నారు.అవసరమైతే మార్క్‌ఫెడ్ ఎండీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.అకాల వర్షాల వల్ల మొక్కజొన్న తడిసి నష్టం జరిగే ప్రమాదం ఉందని,చేర్యాల, నర్మెట కేంద్రాల్లో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని,రైతులకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై...

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి - సీఎం రేవంత్...

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం * సీఐ రమేష్ నాయక్ కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం...

ప్రేమ వివాహం విషాదాంతం

ప్రేమ వివాహం విషాదాంతం మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌ చేర్యాల మండలం ముస్త్యాల...

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి * సీఎం రేవంత్ రెడ్డికి లేఖ...

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి * కరపత్రాల ఆవిష్కరణ చేసిన కమిటీ సభ్యులు కాకతీయ,చేర్యాల:చేర్యాల...

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ,చేర్యాల:...

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి * విద్యార్థి కీర్తన మృతి పట్లv సంతాపాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img