“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి”
•చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి
•వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత
కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి,వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్థానిక రామాలయం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమరవీరుల స్థూపం,అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గెలిచిన 14 మంది కౌన్సిలర్లు,బీఆర్ఎస్, సీపీఐ పార్టీ నాయకులు బైక్ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరువురు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మాజీ మున్సిపల్ అధికారులు,సిబ్బంది, కౌన్సిలర్లు,కాంట్రాక్టర్లు శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.


