epaper
Tuesday, April 7, 2026
epaper

తండ్రే హంత‌కుడు

తండ్రే హంత‌కుడు
కవల పిల్ల‌ల హ‌త్య కేసును చేధించిన పోలీసులు
ఆస్తిపై మోజు.. మగపిల్లాడు కావాల‌నే కోరికతోనే చిన్నారుల అంతం
బావిలోకి తోసేసి హ‌త్య చేసిన‌ ముంచి ఇద్దరు చిన్నారుల హత్య చేసిన తండ్రి
కుటుంబ సభ్యులతో కలిసి పథకం
దాంపత్య కలహాలు, ఆస్తి వివాదాలే కారణం
నలుగురు నిందితుల అరెస్ట్.. మోటార్ సైకిల్, మొబైల్ స్వాధీనం
వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ గౌస్ అలాం

కాక‌తీయ, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో చోటు చేసుకున్న కవల ఆడపిల్లల హత్య కేసు సంచలనంగా మారింది. కన్నతండ్రి కచ్చు శ్రీశైలం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి మోజు, మగపిల్ల కోరికతో సొంత కూతుళ్లనే బావిలో ముంచి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, విచారణలో పక్కా పథకం ప్రకారం చేసిన ఘాతుకంగా బయటపడింది. ఏప్రిల్ 3న సాయంత్రం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన శ్రీశైలం తన నాలుగేళ్ల కవలలు గీతాంశి, గీతాన్వికలను పొలం వద్దకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే పిల్లలు బావిలో పడ్డారని చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గీతాంశి మృతదేహం బావిలో నుంచి పైకి తేలగా, గీతాన్విక కోసం అదే బావిలో మరియు పరిసర ప్రాంతాల్లో గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ కుమార్ పరిశీలించి గ్రామంలో ఉద్రిక్తతలు నివారించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దాంపత్య కలహాలు.. 2 కోట్ల ఆస్తే కార‌ణం..!

నిందితుడు శ్రీశైలం జూబ్లీనగర్ గ్రామానికి చెందినవాడు కాగా, అతని భార్య మౌనిక మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందినది. వీరికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల కవలలు గీతాంశి, గీతాన్విక జన్మించినప్పటి నుంచి మగపిల్ల కోరిక నెరవేరకపోవడం, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సుమారు రూ.2 కోట్ల ఆస్తి అమ్మాయిల పెళ్లిళ్లకే ఖర్చవుతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్‌తో కలిసి చిన్నారులను తొలగించుకోవాలని ముందుగానే కుట్ర పన్నినట్టు విచారణలో తేలింది.

గోపాల్‌పూర్‌లో పట్టుబడిన నిందితులు

పథకం ప్రకారం పిల్లలను బైక్‌పై పొలానికి తీసుకెళ్లి బావిలో తోసి, కాపాడుతున్నట్టు నాటకం ఆడిన శ్రీశైలం ఘటన అనంతరం గోపాల్‌పూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. పోలీసులు వేగంగా స్పందించి ఏప్రిల్ 5న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించారు. కచ్చు శ్రీశైలం (తండ్రి), కచ్చు అశోక్ (తాత), కచ్చు లావణ్య (నానమ్మ), కచ్చు రాకేష్ (బాబాయ్)లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్, ఒక వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ సి.ఐ. నిరంజన్ రెడ్డి సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సగరులకు భూమి కేటాయించాలి

సగరులకు భూమి కేటాయించాలి మంత్రి పొన్నంకు విన‌తి కలెక్టర్‌కు సిఫార్సు చేసిన పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కాకతీయ, కరీంనగర్ :...

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు.. కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు...

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం బీజేపీ క‌రీంన‌గ‌ర్‌...

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో...

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ ప్ర‌తీ ఇంటిని సోదా చేసిన పోలీసులు డీఎస్పీ నాగేంద్రచారి...

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు కాకతీయ,...

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు ఆల్ ఇండియా అగ్రికల్చర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img