జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
కాకతీయ పెద్దవంగర : దేశ అభివృద్ధికి అనగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య అన్నారు.దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని నవ సమాజ స్థాపన కోసం కృషిచేసిన కృషివలుడు అని కొనియాడారు.దేశ అభివృద్ధికి అనగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, ప్రధాన కార్యదర్శి సంజయ్, నాయకులు సుధీర్,సమ్మయ్య, పర్శరాములు, వెంకన్న, హరీష్,యాకన్న అనపురం రవి ,నిమ్మల శ్రీనివాస్, చిలక బిక్షపతి , అనుదీప్,దేశ్లి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


