హనుమాన్ మాలదారులపై అధికార పార్టీ నాయకుడి చిందులు
– రోడ్డెకిన హనుమాన్ భక్తులు
కాకతీయ, నర్సంపేట: హనుమాన్ స్వాములపై బూతులు మాట్లాడుతూ తిట్టారని ఆరోపిస్తూ హనుమాన్ భక్తులు నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు హనుమాన్ ఆలయం చుట్టూ చెప్పులు వేసుకొని వాకింగ్ చేయకూడదని స్వాములు చెప్పడంతో ఆగ్రహానికి లోనై కోపంతో ఇష్టమొచ్చినట్టుగా తిట్టినట్లు హనుమాన్ మాలదారులు తెలిపారు. అధికార పార్టీ నాయకుడి తీరుతో ఆదివారం ఉదయం రాస్తోరోకో నిర్వహించారు. దింతో కిలో మీటర్ మేర ట్రాపిక్ జాం అయింది. పోలీసుల జోక్యంతో స్వాముల నచ్చజెప్పి గొడవ సద్దుమనిగించారు.


