epaper
Saturday, November 15, 2025
epaper

రెవెన్యూశాఖ అధికారుల‌పై ఏసీబీ ఫోక‌స్‌..ఆదాయం క‌న్నా ఆస్తులు ఉన్నవారే టార్గెట్..!!

*నెక్ట్స్ ఎవ‌రు..?
*రెవెన్యూశాఖ అధికారుల‌పై ఏసీబీ ఫోక‌స్‌
*ఆదాయం క‌న్నా ఆస్తులు మిన్న‌గా ఉన్న వారిపైనే ఫోక‌స్‌
*ఆదాయానికి మించి ఆస్తులున్న‌ట్లుగా వెళ్తున్న ఫిర్యాదులు
*ఏసీబీని ఆశ్ర‌యిస్తున్న భూ బాధితులు.. వ‌ల‌వేస్తున్న అవినీతి నిరోధ‌క శాఖ‌
*ఇప్ప‌టికే ఆర్డీవో రేసులో ఉన్న ఇద్ద‌రు ఎమ్మార్వ‌ల‌కు షాక్‌
*పోస్టింగ్‌ల విష‌యంలో పెరిగిన పోటీ.. ఫిర్యాదుల్లోనూ ఉద్యోగుల మ‌ధ్య పోటీ..!

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రెవెన్యూ శాఖ ఉద్యోగుల‌పై ఏసీబీ గురి పెట్టింది. లంచ‌గొండులు.. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా కొంత‌మంది అధికారుల‌పై ఫిర్యాదులు వెళ్తుండ‌టంతో న‌జ‌ర్ వేస్తోంది. బాధితులు, వివిధ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారంతో ఏసీబీ స్కెచ్ గీస్తోంది. ఆదాయానికి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా ఫిర్యాదులు.. ప్ర‌భుత్వ నిఘా వ‌ర్గాల స‌మాచారంతో దాడులుకు దిగుతుండ‌టం గ‌మ‌నార్హం. భూములు విలువ ఎక్కువ‌గా ఉన్న వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ప‌నిచేసే అధికారుల‌పై ఫిర్యాదులు వెళ్తున్న‌ట్లు స‌మాచారం.

సోదాల‌తో రెవెన్యూలో క‌ల‌వ‌రం..!

స‌హ‌జంగా కార్యాల‌యంలో జ‌రిగే ప‌నుల‌కు డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం.. భూ రిజిస్ట్రేష‌న్లు.. ఉచితంగా చేయాల్సిన ప‌నుల‌కు రేట్లు ఫిక్స్ చేసి ఎమ్మార్వోలు కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ‌సూళ్లకు తెగ‌బ‌డుతుంటారు. త‌మ చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌ని కానిచ్చేస్తున్న అధికారుల‌ను ప‌ట్టుకోవ‌డం ఏసీబీకి కూడా అంత సులువు కావ‌డం లేదు. దీంతో తాజాగా ప్ర‌భ‌త్వ నిఘా వ‌ర్గాలు, ఇత‌ర ప్ర‌జా సంబంధాలు, ఫిర్యాదు దారుల నుంచి వ‌స్తున్న సమాచారంతో ఆదాయానికి మించిన ఆస్తులేమైనా ఉన్నాయా అంటూ త‌నిఖీలు దిగుతుండ‌టం గ‌మనార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ త‌ర‌హా సోదాలు గ‌డిచిన ఏడాదిన్న‌ర కాలంలో ఇద్ద‌రి ఎమ్మార్వ‌లో ఇళ్ల‌లో చోటు చేసుకున్నాయి.

గ‌తంలో ధ‌ర్మ‌సాగ‌ర్ ఎమ్మార్వోగా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు పొరుగు జిల్లా జ‌మ్మికుంట‌కు బ‌దిలీపై వెళ్లిన అధికారి ర‌జ‌ని ఇళ్ల‌పై ఏడాదిన్న‌ర క్రితం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించి సీజ్ చేశారు. ర‌జ‌నిపై కేసు న‌మోదు చేసి ఏసీబీ కోర్టులో నిల‌బెట్టారు. ఏసీబీ విచార‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేసిన బండి నాగేశ్వ‌ర్ ఇళ్ల‌పైనా ఇదే త‌ర‌హాలో ఏసీబీ దాడులు నిర్వ‌హించింది. సుమారు రూ.5కోట్ల పైచిలుకు అక్ర‌మాస్తుల‌ను గుర్తించిన‌ట్లుగా ఏసీబీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఇద్ద‌రు ఆర్డీవో రేసులో ఉన్న‌వాళ్లే..!

ధ‌ర్మ‌సాగ‌ర్ ఎమ్మార్వోగా ప‌నిచేసిన ర‌జ‌ని రెడ్డి, ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేసిన బండి నాగేశ్వ‌ర్‌రావులు ఇద్ద‌రు కూడా ఆర్డీవో రేసులో ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఎమ్మార్వోలు స‌హ‌క‌రించ‌క‌పోతే ట్రాన్స‌ఫ‌ర్ బ‌హుమానంగా ఉంటోంద‌న్న విమ‌ర్శ‌లు ఆ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో కూడా చాలా వ‌ర‌కు వాస్త‌వం ఉంది. నిజాయితిగా ఉంటే.. ఎమ్మెల్యే స‌హా ఇత‌ర‌ప్ర‌జాప్ర‌తినిధుల ఒత్తిళ్లు కూడా ఉంటున్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఈనేప‌థ్యంలోనే.. స్వామికార్యం.. స్వ‌కార్యం అన్న రీతిలో ఎమ్మార్వోల అక్ర‌మాలు.. అవినీతి వ్య‌వ‌హారాలు అలా జ‌రిగిపోతున్నాయి. ఇదిలా ఉండ‌గా రెవెన్యూ ఉద్యోగుల మ‌ధ్య ఉన్న పోస్టింగ్‌ల పోటీ .. అంత‌ర్గ‌త విబేధాలతో కూడా త‌మ అనున‌యుల‌తో ఏసీబీకి ఒక‌రిపై మ‌రోక‌రు ఫిర్యాదులు చేసుకుంటున్న‌ట్లు ఉద్యోగుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. ఏసీబీ న‌జ‌ర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై కొన‌సాగుతోంద‌ని.. నెక్ట్స్ ఎవ‌రో చూడాలంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img