epaper
Friday, April 10, 2026
epaper

పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు

పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు
భక్తులకు సులభ ప్రయాణం
వేములవాడ నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు సర్వీసులు
రవాణా సౌకర్యాల విస్తరణకు చర్యలు
బస్టాండ్ల ఆధునీకరణకు నిధుల మంజూరు
మహిళలకు ఉచిత ప్రయాణంతో లాభాలు
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సర్వీసులు కల్పించడం ద్వారా భక్తులకు సులభ ప్రయాణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ నుంచి ఇతర పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇప్పటికే వేములవాడ నుంచి తిరుపతికి నడుస్తున్న బస్సులు మంచి స్పందన పొందుతున్నాయని, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల డిపోల నుంచి కూడా బస్సుల సంఖ్య పెంచాలని కోరినట్లు వెల్లడించారు.

బస్టాండ్ల ఆధునీకరణకు ప్రాధాన్యం

వేములవాడ బస్టాండ్ అభివృద్ధికి రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట ప్రాంతాల్లోని బస్టాండ్లను కూడా దశలవారీగా ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. తిప్పాపూర్ బస్టాండ్ తొలగింపునకు గతంలో ప్రయత్నాలు జరిగితే తాను అడ్డుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల వారి ఆదాయం ఆదా అవుతోందని, వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు జీవిత బీమా అందిస్తున్నామని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, తిప్పాపూర్ మూడవ వంతెన, రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంబడి ఉన్న పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. త్వరలో భద్రాచలం, బాసరలకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వేములవాడ–ముంబై బస్సు సర్వీస్ విజయవంతంగా నడుస్తోందని, ప్రజలు ఆర్టీసీ బస్సులను ఎక్కువగా వినియోగించాలని ఆది శ్రీనివాస్ కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ,శంకరపట్నం :...

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య కాకతీయ,చిగురుమామిడి : భవన...

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఏప్రిల్ 16...

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం...

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య అవగాహన కల్పించాలి కలెక్టర్ గరిమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img