ఎన్సిసి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
కాకతీయ, జమ్మికుంట : ఎన్సిసి ద్వారా క్రమశిక్షణ గల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని జమ్మికుంట ఎన్సిసి ఉపాధ్యాయుడు మేకమల్ల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఉగాది పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్ బాబు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. దేశానికి క్రమశిక్షణ గల సైనికులను అందించడంలో ఎన్సిసి కీలక పాత్ర పోషిస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతీకలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుడిగా మరింత సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్, రవీందర్ రెడ్డి, స్రవంతి, యేసుమని, వనజ, జ్యోతి, శైలజ, లక్ష్మి, ప్రేమలత, పద్మ, వైశాలి, త్రివేణి, తిరుమల, స్వరూప రాణి, స్వామి, రాం రాజయ్య, సంపత్, సమ్మయ్య, ప్రభాకర్, వరదరాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


