వరంగల్లో ఏసీబీ రైడ్
రిజిస్ట్రేషన్ ఆర్వో కార్యాలయంలో సోదాలు
కార్యాలయంలో కీలక ఫైళ్లు స్వాధీనం
కాకతీయ, హన్మకొండ : వరంగల్లో రిజిస్ట్రేషన్ ఆర్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కీలక రికార్డులను పరిశీలిస్తూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. హన్మకొండ జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు తలుపులు మూసి తనిఖీలు ప్రారంభించారు. కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఛాంబర్తో పాటు కార్యాలయంలోని ఇతర గదులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. సోదాల సందర్భంగా సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆంక్షలు విధించారు. కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.


