నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు
రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
యజమానికి రూ.12 లక్షల జరిమానా
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అక్రమంగా తయారు చేస్తున్న యూనిట్పై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.12 లక్షల విలువైన ప్లాస్టిక్ గ్లాసులు, ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఉమానాగ్ పాలిమర్స్ పేరుతో నడుస్తున్న ఈ యూనిట్లో ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ ప్లాస్టిక్ గ్లాసులను భారీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి. బాబులాల్ బృందం ఈ దాడులు చేపట్టింది. ఈ ఘటనలో యూనిట్ యజమాని తోట ప్రసాద్ పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జి డబ్ల్యూ ఏం సి ) హెల్త్ & శానిటేషన్ విభాగం అధికారులు రూ.50,000 జరిమానా విధించి, యూనిట్కు నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో జి.డబ్ల్యుఎంసీ అధికారులు భాస్కర్, గోల్కొండ శ్రీను, జె. భీమయ్యతో పాటు టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగం, తయారీపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.


