నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల గ్రామంలో యాదవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంఘం సొసైటీ సభ్యులు సమిష్టిగా పాల్గొని కొత్త కమిటీని ఎన్నుకున్నారు. యాదవ సంఘం అధ్యక్షుడిగా దద్దు కుమారస్వామి యాదవ్, ఉపాధ్యక్షుడిగా గోపురవేణి తిరుపతి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజు యాదవ్, కార్యదర్శిగా బేతి రవీందర్ యాదవ్, కోశాధికారిగా మొర్రి రవీందర్ యాదవ్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దద్దు కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, సభ్యుల సహకారంతో యాదవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మాజీ సర్పంచ్ దొంగల శ్రీనివాస్ తిరుపతమ్మ, మాజీ ఎంపీటీసీ కొండం శ్రీనివాస్తో పాటు సంఘం సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు అభినందించారు.


