సమానత్వం సాధించాలంటే చదువే మార్గం
మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
కాకతీయ, పెద్దవంగర : సామాజిక, ఆర్ధిక,రాజకీయ సమానత్వం రావాలంటే చదువే ముఖ్యమని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం టీపీటీఫ్ పెద్దవంగర మండల శాఖ ఆధ్వర్యంలో మహనీయుల స్మృతి మార్నింగ్ వాక్ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి మాట్లాడారు. గతంలో ఉన్న కుల వివక్షతలను, మూఢనమ్మకాలను మహిళల పట్ల వివక్షతను రూపుమాపడానికి,ప్రజలను చైతన్య పరచడానికి జ్యోతి రావ్ పూలె పోరాడడాన్నారు. దేశంలో కుల,మత, లింగ,ఆర్ధిక సమానత్వం సామాజిక, ఆర్ధిక,రాజకీయ సమానత్వం రావాలంటే చదువే ముఖ్యమని,ఆ చదువుతో సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కరం దొరుకుతుందని అంబేద్కర్,జగజీవన్ రావ్ పోరాడారని తెలిపారు.దళిత ,బలహీన వర్గాల కొరకు అనేక హక్కులు,సదుపాయలు కల్పించిన మహానుభావులను మనం స్మరించుకోవాలన్నారు. వారి ఆశయాల సాధన కోసం అందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డే కొత్తపల్లి హెచ్ఎం షెశవల్లి, టిఫిటీఫ్ జిల్లా కార్యదర్శి పెండ్లి రవీందర్ రెడ్డి మండల కార్యదర్శి శ్రీనివాస్,దయాకర్, లక్ష్మణ్, నాయకులు మురళి,దేవేందర్, అరుణ,మున్ని, చంద్రశేఖర్,రవి,జాతోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


