epaper
Friday, April 3, 2026
epaper

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..

*863 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వబోతున్నాం..

*భూ నిర్వాసితులకు 43.15 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

*రూ. 43.33కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణం..

*టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి..

కాకతీయ,గీసుగొండ: టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మండలంలోని కొనాయిమాకుల పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ నిర్వాసితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 863 మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయ నున్నట్లు తెలిపారు.భూ నిర్వాసితులకు గృహ వసతి కల్పించేందుకు రూ.43.15 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. అదనంగా సకల సౌకర్యాలతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు.భూ నిర్వాసితుల అంగీకారం మేరకు ఒక్కో ఇంటిని రూ.5 లక్షల వ్యయంతో నిర్మించి పూర్తి చేసి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు.

*రూ.43.33 కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ అభివృద్ధి..

రాజీవ్ గాంధీ టౌన్షిప్ అభివృద్ధి కోసం మొత్తం రూ.43.33 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా హౌసింగ్ లేఅవుట్‌లో వర్షపు నీటి కాల్వల నిర్మాణానికి రూ.910 లక్షలు, నీటి సరఫరా వ్యవస్థ, కాలువల నెట్వర్క్, అండర్‌గ్రౌండ్ సంప్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లకు రూ.920 లక్షలు కేటాయించారు. ప్రాథమిక పాఠశాల భవనానికి రూ.277 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.160 లక్షలు, గ్రామపంచాయతీ కార్యాలయానికి రూ.63 లక్షలు, వెటర్నరీ ఆసుపత్రికి రూ.50 లక్షలు మంజూరు చేశారు. రోడ్లు,వర్షపు నీటి కాల్వలు, పైప్ కల్వర్ట్ నిర్మాణానికి రూ.760 లక్షలు,విద్యుత్ సదుపాయాల కోసం రూ.182.93 లక్షలు, కొత్త ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటుకు రూ.1010.40 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ఇటీవల జరిగిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, తమ హయాంలో చేపడుతున్న పనులను ఇతరులు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగిందని, అనంతరం టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై సరైన దృష్టి సారించలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలుమార్లు టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించి భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని,కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు.భూ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భూ నిర్వాసితులకు గృహ నిర్మాణాలతో పాటు అన్ని మౌలిక సదుపాయా లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్‌ను ఏర్పాటు చేసి, దానిని గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అనంతరం 115 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేశారు.

*కూడా సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం…
కూడా చైర్మన్ ఇనుగాల..
టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు కూడా సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని తెలిపారు. భూ నిర్వాసితులకు ఎకరానికి 100 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని అప్పట్లో చేసిన ఆందోళనల ఫలితంగానే నేడు ఆ హామీ అమలు అవుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు రాజీవ్ గాంధీ టౌన్షిప్‌లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

*అనధికార లేఔట్లపై ఉక్కు పాదం మోపుతాం

కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా లేఅవుట్లు చేసి క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు.నాన్ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, అలాంటి లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అనధికార లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని కూల్చివేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ నాన్ లేఅవుట్లపై ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసి అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,వరంగల్ ఆర్డీఓ సుమ,జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జెడ్‌ఎం స్వామి, గీసుకొండ తహసిల్దార్, సంగెం తహసిల్దార్ రాజకుమార్, స్థానిక సర్పంచులు వజ్ర రాజు, కక్కేర్ల సుభాష్,గాలి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం? ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం! బోర్డు తిప్పేసిన...

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు...

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కాకతీయ, రాయపర్తి: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు...

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు కాక‌తీయ‌, జనగామ : జనగామ పట్టణంలోని నారాయణ హై...

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం *మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో...

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ కాకతీయ, ములుగు...

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం పరకాల ఎమ్మెల్యే రేవూరి...

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కాకతీయ, వరంగల్ : వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img