బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు
మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి
బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం
విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ధ్వజం
కాకతీయ ,కొత్తగూడెం : ప్రజల్లో మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న విష ప్రచారం మానుకోవాలని లేదంటే ప్రజల నుంచి తగిన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని అసత్య ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు సుద్దపూసలేం కారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు. ప్రజాబలంతో ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ బిఆర్ఎస్ నేతలు దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నేతలు నుంచి అనేక అవమానాలను ఎదుర్కొన్నారని ఆ అవమానాలను తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీని బొందపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేసిన నేతలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రథముడిగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఖబడ్దార్ మరొక్కసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎన్ని అసత్య ఆరోపణలు చేసినప్పటికీ మచ్చలేని నాయకుడిగా శ్వేత వర్ణ పత్రముగా నిలుస్తాడని స్పష్టం చేశారు. చేస్తున్న అసత్య ఆరోపణలు ఆపకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ,ఊకంటి గోపాలరావు, కొత్వాల శ్రీనివాసరావు కార్పొరేషన్ కొత్తగూడెం ఉపమేయర్ లలిత కుమారి మండే వీర హనుమంతరావు, వై శ్రీనివాస్ రెడ్డి కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు


