పట్టుబడ్డ వాహనం వేలం
కాకతీయ, చేర్యాల: పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన బజాజ్ ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీ15టిఏ6852 వాహనాం ఏప్రిల్ 02, 2026 (గురువారం ) ఉదయం 11గంటలకు ఎక్సెజ్ అధికారుల ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ పి. నర్సింహులు తెలిపారు.వేలంపాటలో పాల్గొనేవారు ధరావత్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. వేలంపాటలో పాల్గొనే వాళ్లు ముందుగా వాహనాలను సరిచూసుకొని వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలంపాటలో వాహనాన్ని దక్కించుకున్న తర్వాత సదర్ వాహనం తీసుకోకపోతే అతని డిపాజిట్ జప్తు చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు తోపాటు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా సమర్పించాలని తెలిపారు. వేలం పాటలో వాహనం తీసుకున్న వారు అదే రోజు మొత్తం అమౌంట్ చెల్లించి స్వాధీన పరచుకోవాలని వివరించారు.


