పాపయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కాకతీయ,రాయపర్తి : మండలంలోని గట్టికల్లు గ్రామానికి చెందిన చెవ్వు పాపయ్య మరణం పట్ల ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆమె పాపయ్య నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పాపయ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని,కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ క్రమంలో శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం కోల్పోవద్దంటూ ఓదార్చారు.అలాగే కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,సర్పంచ్ చెవ్వు హేమలత కాశినాధం,మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.


