ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం
: ఇన్స్పెక్టర్ శ్రీహరి
కాకతీయ, సత్తుపల్లి:ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీ హరి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రాణనష్టాన్ని నివారించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్” ప్రత్యేక కార్యక్రమం ద్వారా”సురక్షితంగా గమ్యం చేరడం” “ప్రాణాలతో ఉండటం” అనే లక్ష్యంతో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతపై సత్తుపల్లి లోని జెవిర్ కాలేజ్ లో వాకార్స్ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ… ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు. అదేవిదంగా మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.


