డ్రైవర్లకు కంటి పరీక్షలు అవసరం
మంచి చూపే రోడ్డు భద్రతకు కవచం..
ఎస్సై ప్రమోద్ కుమార్
కాకతీయ, పెద్దవంగర : డ్రైవర్లకు మంచి చూపు ఉండడం రోడ్డు భద్రతలో కీలకమని ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. కంటి పరీక్షల ద్వారా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చని సూచించారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సాయి సిరి అప్టికల్ సహకారంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై ప్రమోద్ కుమార్ మాట్లాడారు. డ్రైవర్లు కంటి పరీక్షలు నిరంతరం చేయించుకోవాలని అన్నారు. ఎదుటి వాహనాలు, అడ్డంకులను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. విజయభాస్కర్, సాయి సిరి అప్టికల్ ప్రొప్రైటర్ సంతోష్, డాక్టర్ పాల్గొన్నారు. వాహనదారులు కార్యక్రమంలో హాజరయ్యారు.


