ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్
కార్పొరేట్ దోపిడీపై వ్యాపారుల గర్జన
మల్కాజిగిరి చికెన్ షాప్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
కాకతీయ:మల్కాజిగిరి:“మార్జిన్ లేని వ్యాపారం మేము చేయలేము.. మా పొట్ట కొట్టకండి” అంటూ చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన చికెన్ షాప్ అసోసియేషన్ విలేకర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బడా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యం వల్ల సామాన్య చికెన్ వ్యాపారుల బతుకులు భారంగా మారాయి.
తగ్గిన మార్జిన్: కోడి ధరలను కార్పొరేట్ శక్తులే నియంత్రిస్తూ, వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించేశాయి.
ధరల నిర్ణయంలో చిన్న వ్యాపారులకు ప్రాధాన్యత లేకపోవడంతో, పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు.
తక్షణమే మార్జిన్ రేటును పెంచి, చిన్న వ్యాపారులను ఆదుకోకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.


