పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..
*బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలు లోతుగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పిలుపునిచ్చారు.వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం లోని వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 శిక్షణ శిబిరంలో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలు లోతుగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం, ప్రారంభ దశలో ఎదురైన సవాళ్లు, దేశవ్యాప్తంగా విస్తరణ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన తీరు వంటి అంశాలను వివరించారు.అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం పార్టీకి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సమాజ సేవలో ముందుండి ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గట్టికొప్పుల రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు కూతురు రాజు, జిల్లా కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతికుమార్, ములక ప్రసాద్, మొలుగూరి శ్రీనివాస్, సంగెం మండల అధ్యక్షుడు చంద్రమౌళి, గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవి కుమార్, 15వ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్, 16వ డివిజన్ అధ్యక్షుడు ప్రసన్న రాంప్రసాద్, 17వ డివిజన్ అధ్యక్షుడు విజయ్, గోదాసి అశ్విన్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


