రోడ్డుమీద ఇసుక – ప్రయాణికులకు ఇబ్బందులు
కాకతీయ,చిగురుమామిడి : ఇందుర్తి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఇసుక, ఇటుకలను నిర్లక్ష్యంగా వేసి వదిలేయడం వల్ల వాహనదారులు, స్కూల్ బస్సులు, పాదచారులు, సైకిల్ మీద పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ అవరోధాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు .
స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఇలాంటి నిర్మాణ సామాగ్రి ఉంచడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి.
ఈ సమస్యపై వెంటనే స్పందించి, రోడ్డును శుభ్రం చేయించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


