కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు
కాకతీయ, కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో గురువారం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. 13 రోజుల హుండీ ఆదాయం రూ. 60,82,771 అలాగే 36 గ్రాముల మిశ్రమ బంగారం, 2కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీ 127 నోట్లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి. కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో,కె.రవి కుమార్ ,ఈఓ శరభేశ్వర దేవాలయం, సిద్దిపేట ,సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్, ఆర్ సుదర్శన్ , పర్యవేక్షకులు ఎన్. చంద్రశేఖర్ ,స్థానాచార్య పి. మల్లయ్య ,ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తో పాటు సిబ్బంది , అర్చకులు , పోలీస్ సిబ్బంది , స్వర్ణకారుడు నర్సింహాచారి,ఎస్ బిఐ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



