epaper
Thursday, March 26, 2026
epaper

మేడారం గద్దెల వద్ద ప్రమాదం…

మేడారం గద్దెల వద్ద ప్రమాదం…
పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు…
నిర్మాణాల నాణ్యతపై విమర్శలు…
ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు….

కాకతీయ, ములుగు ప్రతినిధి: తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. గద్దెల పరిసరాల్లో నిర్మించిన రాతి దిమ్మలు అకస్మాత్తుగా కూలిపోవడంతో సమ్మక్క ప్రధాన పూజారి కుటుంబానికి చెందిన బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన రానా రమేష్ కుమారుడు యువన్ (6) గద్దెల వద్ద ఆడుకుంటుండగా, అక్కడ ఏర్పాటు చేసిన రాతి దిమ్మలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో బాలుడి కాలు రెండు చోట్ల విరిగినట్లు సమాచారం. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు.

నాసిరకం పనులపై ఆరోపణలు…

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక స్థలంలో నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల నిర్మించిన రాతి కట్టడాలు బలహీనంగా ఉన్నాయని విమర్శలు

కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు
పర్యవేక్షణలో అధికారులు విఫలమయ్యారని స్థానికుల ఆవేదన

గాయపడిన బాలుడికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలి-
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన సురేందర్.

ప్రభుత్వ పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, గాయపడిన బాలుడికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.

మేడారం పనులపై సిట్ విచారణ చేపట్టాలి-బీఆర్‌ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న.
ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, వందేళ్ల కట్టడాలు అంటూ చెప్పిన నిర్మాణాలు వంద రోజులు కూడా నిలవలేదని, కాంట్రాక్టర్లకు పనులు వదిలేసి నాణ్యతను పట్టించుకోలేదని, భక్తుల ప్రాణాల కంటే కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని, మేడారం పనులపై సిట్ విచారణ చేపట్టాలి అని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.

అధికారుల మౌనం.

ఈ ఘటనపై సంబంధిత శాఖల అధికారులు ఇంకా అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈ ఘటన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్నారి గాయపడిన ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర...

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి.. కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ...

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి బాధితుల‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్...

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో...

ప్ర‌భుత్వ బ‌డిలో రాజ‌కీయ భ‌జ‌న‌

ప్ర‌భుత్వ బ‌డిలో రాజ‌కీయ భ‌జ‌న‌ చెన్నారావుపేట కస్తూర్బాలో ఎమ్మెల్యే దొంతి కుమారుడి బ‌ర్త్...

విధుల్లో నిర్లక్ష్యం… మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం... మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ సీపీ సన్ ప్రీత్ సింగ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img