విషాద కుటుంబాలకు ఈటల రాజేందర్ పరామర్శ
కాకతీయ, హుజురాబాద్ : ప్రాంతంలో జరిగిన మరణాల నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్ పలు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన మూగల సంజీవ రెడ్డి (95) మరణించగా వారి నివాసానికి వెళ్లారు. చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. హుజురాబాద్ కౌన్సిలర్ దామెర అనూష అనురాగ్ నానమ్మ సురభి కమలదేవి మరణించడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. గూడూరులో బీజేపీ నాయకుడు బండి కళాధర్ తల్లి మరణించగా నివాళులు అర్పించారు. సర్పంచ్ బండి వనజ అత్త మృతిపై సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని కోరుకున్నారు.


