వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి నివాళి
కాకతీయ, కూసుమంచి : టీడీపీ సీనియర్ నాయకుడు వీరవెల్లి నాగేశ్వరరావు మృతి మండలంలో విషాదాన్ని మిగిల్చింది. అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి నివాళులర్పించారు. మంత్రి క్యాంపు కార్యాలయం ఇంచార్జి బీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాగేశ్వరరావు మృతి తీరని లోటని అన్నారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో జొన్నలగడ్డ రవి కుమార్ పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ మోదుగు వీరభద్రం హాజరయ్యారు. ఇంటూరి శేఖర్, ఎండి ఆసిఫ్, ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


