వేలం గందరగోళం
పంచాయతీపై అవినీతి ఆరోపణలు
పారదర్శకతకు పాతర… వర్తకుల ఆగ్రహం
అధికారులు గైర్హాజరు… కార్యదర్శి ఏకపక్ష తీరు
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వ్యాపారుల ఫిర్యాదు
నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు
విచారణకు కలెక్టర్ ఆదేశాలు
కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గదుల వేలంపాట తీవ్ర గందరగోళానికి దారితీసింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంగణంలో జరిగిన వేలంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వర్తకులు ఆరోపిస్తూ కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మొత్తం ఆరు గదుల్లో ఒకటి మహిళ సంఘాలకు కేటాయించగా, మిగిలిన ఐదు గదులకు ఈనెల 17న వేలంపాట నిర్వహించారు. అయితే వేలం ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో పాటు, తీర్మాన పత్రాలను సంతకాలు తీసుకుని కనుమరుగుచేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 1, 2 నంబర్ గదులకు అప్సెట్ ధర రాలేదని మళ్లీ వేలం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోతున్నారు.

నోటీసు లేదు… నిబంధనలు గాలికొదిలి!
నిబంధనల ప్రకారం ముందస్తు ప్రకటన, దండోరా తప్పనిసరి అయినప్పటికీ అవి ఎక్కడా కనిపించలేదని వర్తకులు ఆరోపిస్తున్నారు. మండల అధికారులు హాజరు కాకుండా పంచాయతీ కార్యదర్శి ఒంటెద్దు పోకడతో వేలం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. చీకటి ఒప్పందాలతో పంచాయతీ ఆదాయానికి గండి కొట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణకు డీపీఓకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సమక్షంలో మళ్లీ పారదర్శకంగా వేలం నిర్వహించాలని వర్తకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పంచాయతీ కార్యదర్శి వినోద్కుమార్ మాత్రం వేలం నిబంధనల ప్రకారమే జరిగిందని వివరణ ఇచ్చారు. గ్రీవెన్స్ ఫిర్యాదు గురించి తమకు సమాచారం లేదని, ఎంపీఓకు ముందుగానే సమాచారం


