నవ్య మృతి బాధాకరం..
కుటుంబానికి అండగా ఉంటాం
బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలం చీమలపాడు గ్రామానికి చెందిన బానోత్ నవ్య అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు తెలిపారు. నవ్య మరణం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆదివారం లకావత్ గిరిబాబు స్వయంగా చీమలపాడు గ్రామానికి చేరుకున్నారు. నవ్య నివాసంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్రునయనాలతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లకావత్ గిరిబాబు మాట్లాడారు. బానోత్ నవ్య అకాలంగా దూరం కావడం చాలా బాధాకరం అని అన్నారు. కష్ట సమయంలో కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దేవుడు కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు. నవ్యకు ఘనంగా నివాళులర్పించారు.


