epaper
Thursday, March 26, 2026
epaper

రేవంత్ అబద్ధాల రాజకీయాలు

రేవంత్ అబద్ధాల రాజకీయాలు
బ‌డ్జెట్ ప్ర‌సంగం సాక్షిగా బ‌య‌ట‌ప‌డ్డాయి
అసెంబ్లీ వేదికగా సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఎమ్ముల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్

కాకతీయ, హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, మోసాల పునాదుల మీదే ఆయన రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ప్రజలను మోసం చేయడం తన స్వభావమని బయటపెట్టారని అన్నారు. కేసీఆర్‌పై పనిగట్టుకుని బురద చల్లడం ఆయన రాజకీయ అజెండాగా మారిందని విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం విభిన్నంగా మాట్లాడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఒకవైపు 3 లక్షల 47 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చామని చెప్పడం, మరోవైపు 3 లక్షల 30 వేల కోట్ల అప్పు కట్టామని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలని అన్నారు. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ప్రభుత్వం కట్టిన అప్పు లక్షా 67 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం అబద్ధాలు మాట్లాడితే ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని తాను మండలిలో ప్రశ్నిస్తే అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం, సీఎం అబద్ధాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బడ్జెట్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్‌ను చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుపై కేటీఆర్ ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారని, దీనికి సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యా శాఖకు కేటాయింపులు తగ్గించారని, 2026-27 బడ్జెట్‌లో కేవలం 8 శాతం మాత్రమే నిధులు ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ అంశంపై విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు డైరెక్టర్ ఫోటోతో ఫేక్...

రైల్వే పరీక్ష కీ విడుదల

రైల్వే పరీక్ష కీ విడుదల పారా మెడికల్ పోస్టుల ప్రాథమిక ఆన్సర్ కీ...

అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్

అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో...

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం దౌత్య విధానం స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంధన...

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌ వారి హక్కుల సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది సామాజిక న్యాయం...

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న...

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img