ఆపదలో ఉన్న వారు అధైర్య పడొద్దు..!
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సాయం
వైద్య ఖర్చులకోసం కోసం అప్పుల పాలు కావద్దు
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండ
పాలకుర్తిలో 323 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
మంజూరైన నిధులు మొత్తం రూ.1,18,52,000
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ,రాయపర్తి /పాలకుర్తి : ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం నిరుపేద కుటుంబాలకు ఈ రోజుల్లో తలకు మించిన భారంగా మారిందని,అనారోగ్యం భారిన పడి ఆపదలో ఉన్న ఏ ఒక్కరు కూడా అధైర్య పడొద్దని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.ఆదివారం
నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె అక్షరాలా కోటి 18 లక్షల 52 వేల రూపాయల విలువైన 323 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. తొర్రూరు మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ. 16,94,000, దేవురుప్పల మండలం 44 మంది లబ్ధిదారులకు రూ.17,30,500,కొడకండ్ల మండలం 34మంది లబ్ధిదారులకు రూ. 9,60,000,పాలకుర్తి మండలం 95 మంది లబ్ధిదారులకు రూ. 33,96,000,రాయపర్తి మండలం 66 మంది లబ్ధిదారులకు రూ. 25,70,500,పెద్దవంగర మండలం 31 మంది లబ్ధిదారులకు రూ.9,74,000, విలువైన చెక్కులను పంపిణీ చేసారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడినప్పుడు అధైర్య పడుద్దని అలాంటి వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు.నియోజకవర్గంలోని ప్రజలకు
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని అభివర్ణించారు.వైద్య ఖర్చులకోసం అప్పులు చేసి,ఇబ్బందులకు గురి కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని లబ్ధిదారులకు అందిస్తుందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు సీఎంఆర్ఎఫ్ పై అవగాహన ఉండాలని,మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు,యూత్ అధ్యక్షులు,సర్పంచులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


