epaper
Thursday, March 26, 2026
epaper

కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ..

కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ..
ఆరు గ్యారంటీలు కాదు ఆరు మోసాలు
ఇదీ ప్రజలకు లాభం లేని బడ్జెట్
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు

కాకతీయ,ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు మోసాలుగా మిగిలిపోయాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమర్శించారు. శనివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ, ఆరు గ్యారంటీలు ఆరు మోసాలుగా మారాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 420 అబద్ధాలుగా మిగిలిపోయాయని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, క్షేత్రస్థాయి ఖర్చులకు ఎక్కడా పొంతన లేదన్నారు. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది అందరూ మోసపోయారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. 2025-26లో రాష్ట్ర అప్పులు 8,05,840 కోట్లుగా ఉన్నాయని, అవి 9 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. మూలధన వ్యయం 20 శాతానికే పరిమితమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు 50 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పినా, 58,713 కోట్ల రెవెన్యూ లోటు చూపించడం వాస్తవ పరిస్థితిని బయటపెడుతోందన్నారు. విద్యకు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. 15 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తే, 8 శాతానికే పరిమితం చేశారని విమర్శించారు. ఎస్సీ సంక్షేమానికి 40,234 కోట్ల నుంచి 11,784 కోట్లకు కోత విధించారని తెలిపారు. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్ల నుంచి 7,937 కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు.

కేంద్ర నిధులతో గొప్పలు

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని కాపీ కొడుతోందని నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. గోదావరి పుష్కరాలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా విస్మరించారని అన్నారు. ఖమ్మం జిల్లాకు ఈ బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు, మున్నేరు మరమ్మతులు, తీగల వంతెనకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. వెలుగుమట్లలో భూ బాధితులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించలేకపోతే పదవి వదలాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శాసన సాయిరాం, మణికంఠ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన సెల్వరాజును రక్షించిన పోలీసులు వాకింగ్‌కు వెళ్లిన మాజీ సర్పంచ్...

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం విద్యారంగ సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులా? ప్రజాపాలనలో...

శభాష్ సుష్మ

శభాష్ సుష్మ పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో బంగారు ప‌త‌కాలు సాధించిన కానిస్టేబుల్ కాకతీయ ,కొత్తగూడెం :...

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి...

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం...

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ...

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img