epaper
Wednesday, March 25, 2026
epaper

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి
కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట
బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి

కాకతీయ, గజ్వేల్ : ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఈద్గా, ప్రజ్ఞాపూర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటూ, రంజాన్ పండుగ క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి శాంతి, సిరిసంపదలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. ఈద్గాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో మైనార్టీల‌కు న్యాయం

గత కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలిచామని, ఇమామ్‌లు, ముజ్జిన్‌లకు గౌరవ వేతనాలు అందించినట్లు తెలిపారు. రంజాన్ తోఫాలు, ఇఫ్తార్ విందుల ద్వారా మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో దాదాపు 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, స్వయం ఉపాధి కోసం వేలాది మందికి శిక్షణ, వాహనాలు అందించామని పేర్కొన్నారు. 3310 మందికి విదేశీ విద్య కోసం స్కాలర్షిప్‌లు అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాలు, జూనియర్ కళాశాలల ద్వారా లక్షలాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని, గజ్వేల్ ప్రాంతంలో దాదాపు రూ.20 కోట్లతో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాలకు స్థలాల కేటాయింపు, మహిళలకు 420 కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రంజాన్ తోఫాల పంపిణీలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని, పేద ముస్లింలను విస్మరిస్తోందని మండిపడ్డారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకుని మైనార్టీలకు సమాన న్యాయం చేయాలని, వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర్, మాజీ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం *సర్పంచ్ కొమ్మురవి కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్...

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల:...

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో...

గ్రామ అభివృద్దే లక్ష్యం

గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్...

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు...

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలి

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలి సీఎం పర్యటనలో నిర్వాసితుల సమస్యలు...

కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..?

కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..? బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న ప్రతి బడ్జెట్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img