కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక సమతుల్యత
బీసీ డిక్లరేషన్ మేరకు అన్ని వర్గాలకు ప్రాధాన్యం
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
కాకతీయ, ఖమ్మం : కాంగ్రెస్ కమిటీని సామాజిక న్యాయం ఆధారంగా అన్ని కుల, మత, వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ సిద్ధం చేశామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీని ప్రకటించినందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా కమిటీ విస్తరణ జరిగిందన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, అనాదికాలం నుండి పార్టీలో కష్టపడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. అన్ని కుల, మత, వర్గాల సమతుల్యత పాటించామని తెలిపారు. ఎన్నికల వాగ్దానం బి సి డిక్లరేషన్ మేరకు జాబితా రూపొందించామని వివరించారు.
ఎగ్జిక్యూటివ్ సమావేశం త్వరలో.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు యువకులు, మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో జాబితా సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. త్వరలో ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి ల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కమిటీ ఏర్పాటుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వారి సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.


