epaper
Thursday, March 26, 2026
epaper

రేపు రైతు భరోసా…

రేపు రైతు భరోసా…
విడతల వారీ ప్ర‌క్రియ‌తో రైతుల్లో ఉత్కంఠ‌
ఎకరం లోపు రైతులకు తొలి ప్రాధాన్యం?
ఎకరానికి రూ.6 వేలే మొదట జమ
అర్హతలపై స్పష్టత లేక టెన్షన్…
ఎక్కువ భూమి ఉన్న రైతుల్లో అసంతృప్తి
కొత్త విధానంపై భయాందోళనలు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు నేడే విడుదల కానుండటంతో ఆశలతో పాటు ఉత్కంఠ కూడా పెరిగింది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి విడత నిధులు జమ కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేయనున్నారు. అయితే ఈ విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనుండటంతో మిగిలిన రైతులు తరువాతి విడతల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రబీ సీజన్ చివరి దశకు చేరుకొని పంటలు కోతల దశలోకి వెళ్లిన సమయంలో నిధుల విడుదల ఆలస్యం కావడం రైతుల్లో అసంతృప్తిని పెంచుతోంది. సాయం కోసం ఎదురుచూసిన రైతులకు ఇప్పుడు కొత్త విధానం మరింత గందరగోళాన్ని తెచ్చింది.

భారీగా పెట్టుబ‌డి.. ఆల‌స్యంగా సాయం

ఈ రబీ సీజన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 3.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 2.72 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 14 వేల ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నాయి. ఒక్కో ఎకరానికి రూ.20 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులు విత్తనాలు, ఎరువులు, కూలీలతో భారీ పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ సాయం వస్తుందనే ఆశతో సాగు ప్రారంభించిన రైతులు ఇప్పుడు బ్యాంకులు, ప్రైవేట్ వనరుల నుంచి సుమారు రూ.544 కోట్ల వరకు రుణాలు తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఒకే సీజన్‌కు జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల వరకు రైతు భరోసా అందగా, ఈసారి కోతల సమయానికి కూడా నిధులు అందకపోవడం రైతుల్లో ఆవేదనకు కారణమైంది.

కొత్త విధానంతో రైతుల్లో గంద‌ర‌గోళం..

ఈసారి ప్రభుత్వం రైతు భరోసాను మూడు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించింది. నేడే తొలి విడతగా రూ.3,590 కోట్లు, ఏప్రిల్ మధ్యలో రెండో విడతగా రూ.2,650 కోట్లు, నెలాఖరులో మూడో విడతతో మొత్తం రూ.9,000 కోట్లు జమ చేయనుంది. అయితే తొలి విడతలో ఎకరానికి రూ.12,000 సాయంలో కేవలం ఒక ఎకరానికి మాత్రమే రూ.6,000 జమ చేయడం రైతుల్లో సందేహాలకు దారితీస్తోంది. ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు పూర్తి సాయం వెంటనే అందకపోవడం అసంతృప్తిని పెంచుతోంది. మూడు విడతల విధానం వల్ల పూర్తి సాయం అందుతుందా లేదా అన్న అనుమానం గ్రామాల వరకు చర్చనీయాంశంగా మారింది.

సర్వే ప్రభావం… అర్హతలపై సందేహాలు

శాటిలైట్ సర్వే కారణంగా నిధుల విడుదల ఆలస్యమైందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం సాగులో ఉన్న భూములకే సాయం పరిమితం చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. దీంతో చాలామంది రైతులు అనర్హులయ్యే అవకాశం ఉందన్న భయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోతల దశకు చేరుకున్న పంటలకు భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు “ఈ సీజన్‌కు రైతు భరోసా అందుతుందా?” అన్న సందేహంలో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టత రాకపోవడంతో గ్రామాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శవాన్ని తీసుకెళ్లాలంటే

శవాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ను తోయాల్సిందే! ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…...

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ :...

వైద్యం పేరుతో దోపిడీ

వైద్యం పేరుతో దోపిడీ పెద్ద ఆస్ప‌త్రుల‌తో గ్రామీణ వైద్యుల లింకు చిన్న వైద్యానికి పెద్ద...

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..! క‌రీంన‌గ‌ర్‌ కలెక్టర్‌కు మొలంగూర్ వాసుల‌ వినతి గ్రామానికి రావాల్సిందిగ...

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img