epaper
Thursday, March 26, 2026
epaper

మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి

మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు
31న రైతు సంఘం సదస్సును జయప్రదం చేయాలి

కాకతీయ, వరంగల్ : రైతులు అప్పులపాలు కాకుండా వారు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అలాగే మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని కోరారు. ఈ మేరకు వరంగల్ లోని అబ్బనికుంటలో గల రైతు సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం ఉపాధ్యక్షులు ఉరటి అంశాలరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న ఇక్కడే రాష్ట్ర సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులు పెట్టే రూ.100 పెట్టుబడికి అదనంగా రూ.50 కలిపి మొత్తంగా రూ.150 చెల్లించాలని స్వామినాథన్ కమిటీ పేర్కొన్నా ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చే స్వామినాథన్ కమిటీ సూచనలు.. ఆ తర్వాత పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి 50శాతం సబ్సిడీ ఇస్తుంటే మన దేశంలో 3% మాత్రమే ఇస్తున్నదని అన్నారు. కనీసం మన దేశంలో రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతోందని మండిపడ్డారు. వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే ఐక్య పోరాటాలతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ ఈనెల 31న జరిగే సదస్సులో రైతాంగం సమస్యలు.. పరిష్కార మార్గాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు హాజరవుతున్నారని, తెలంగాణ వ్యాప్తంగా రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి సదస్సు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కమిటీ సభ్యులు మోకిడ పీరయ్య, జంగ జనార్దన్ రెడ్డి, లాడే మోహన్ రావు, రేముడాల దామోదర్ రెడ్డి, గుండెకారి రాజేశ్వరరావు, బొల్లు ఎల్లయ్య, నల్ల విజయేందర్, సముద్రాల రాజమౌళి, సోమిడి సాంబయ్య, రాజేందర్, సముద్రాల బిక్షపతి, రవీందర్ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడ‌క‌లేద‌ని,...

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌ కాకతీయ,...

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో...

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img