ముస్లింలకు ప్రభుత్వ తోఫా
ఇల్లంతకుంటలో నూతన వస్త్రాల పంపిణీ
కాకతీయ, జమ్మికుంట/ ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మహిళలకు అందజేస్తున్న నూతన వస్త్రాలను ఇల్లంతకుంట దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు నూతన వస్త్రాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూసే విధంగా చర్యలు తీసుకుంటోందని, సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


