రంజాన్ తోఫాలతో సేవా సందేశం
మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్
కాకతీయ, మేడ్చల్ మల్కాజ్గిరి: రంజాన్ పవిత్ర నెలలో అవసరమైన వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత అని మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. న్యూ శ్రీనగర్ కాలనీ మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు మక్బూల్ ఖాన్, అయూబ్ ఖాన్, రషీద్ భాయ్, మహాథబ్, రఫీక్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు. రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.


