మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రంజాన్ తోఫాలు పంపిణీలో… మంత్రి అడ్లూరి లక్ష్మన్ కూమార్
కాకతీయ, జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలంతో అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ధర్మపురి పట్టణంలోని ఎస్ఎచ్ గార్డెన్లో నిర్వహించిన తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ధర్మపురి నియోజకవర్గంలో 2,050 మంది ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి ధర్మపురి అభివృద్ధికి నిధులు సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బస్ డిపో మంజూరు కోసం ముఖ్యమంత్రితో చర్చించి పుష్కరాల లోపు నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.


