epaper
Thursday, March 19, 2026
epaper

22 నుంచి రైతుభరోసా..

22 నుంచి రైతుభరోసా..

70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.3,590 కోట్ల నగదు బదిలీ

ఇప్పటికే అన్న‌దాత‌ల అకౌంట్లోకి రూ. 18 వేల కోట్లు

ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ

అన్న‌దాత‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్‌

రైతును రాజు చేయ‌డ‌మే ల‌క్ష్యమ‌ని పున‌రుద్ఘాట‌న‌

రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన సీఎం .. మంత్రులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి ‘రైతు భరోసా’పై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా కింద మూడు విడతల్లో మొత్తం రూ.9వేల కోట్ల నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈమేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్​లోని రవీంద్ర భారతిలో భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పంచాంగం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని పునరుద్ఘాటించారు. కర్షకులు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్న ఆయన రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18 వేల కోట్లను ఇచ్చామన్నారు. ఈనెల 22 నుంచి రైతుభరోసా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ఈనెల 22 నుంచి రైతుభరోసా

సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల సమస్యలను పరిష్కారించామని వెల్లడించారు. ఫలితంగా ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్య హక్కులను పొందుతున్నారని తెలిపారు. సాదాబైనామాలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. ఉగాది అనేది రైతుల పండుగని అభివర్ణించారు. కర్షకుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్రమంతులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఉంది.

మూడు విడతలు.. రూ.9,000 కోట్లు

రైతు భరోసా నిధుల బదిలీని ప్రభుత్వం మూడు విడతలుగా చేయనుంది. తొలి విడతగా ఈనెల 22 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకిరూ.3,590 కోట్ల నగదు బదిలీ చేయనున్నారు. మొదటి రోజు ఒక ఎకరం భూ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేస్తారు. అనంతరం మూడు వారాల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు జమ చేయనుంది. ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడో విడతగా మిగిలిన రూ.2,760 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా, రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వమని మరోసారి రుజువైందని తుమ్మల పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌ రెండేళ్లుగా విడ‌దీయ‌రాని బంధం మార్జాలం చినిపోవ‌డంతో మ‌నోవేద‌న‌ పురుగుల...

వెలుగుమట్ల భూముల‌పై హైకోర్టు స్టే

వెలుగుమట్ల భూముల‌పై హైకోర్టు స్టే ఇళ్ల కూల్చివేతలపై కోర్టు ఆగ్రహం ప్రభుత్వ చర్యలపై అసహనం...

ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం

ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం స్పీకర్ తీర్పు.. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు...

క‌విత దీక్షకు కుమారుడి మద్దతు

క‌విత దీక్షకు కుమారుడి మద్దతు వెలుగుమట్ల బాధితుల కోసం మూడో రోజు నిరాహార...

108మంది మావోయిస్టుల లొంగుబాటు

108మంది మావోయిస్టుల లొంగుబాటు స‌రెండ‌ర‌యిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు 101 అత్యాధునిక...

మూసీపై మూడుపార్టీల ముమ్మర రాజకీయం..!

మూసీపై మూడుపార్టీల ముమ్మర రాజకీయం..! కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం అభివృద్ధిని...

మాజీల పయనమెటు..?!

మాజీల పయనమెటు..?! రాజకీయ అరంగేట్రంపై జ‌నాల్లో ఆసక్తి రంగంలోకి దిగితే ఉత్తర తెలంగాణ రాజకీయాలపై...

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం ఎమ్మెల్యేలు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img