ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం
పరాభవ నామ సంవత్సర విశిష్టత వివరణ
వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి
కాకతీయ, కరీంనగర్: ఉగాది పర్వదినం మన జీవితంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి తెలిపారు. పరాభవ నామ సంవత్సరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని వివరించారు. అలుగునూరు శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు. పరాభవ అంటే ఓటమి మాత్రమే కాకుండా మనలోని అజ్ఞానం, అహంకారం మీద విజయం సాధించడమని తెలిపారు. ఉగాది పచ్చడిలోని రుచుల్లా జీవితంలో వచ్చే అనుభవాలను సానుకూలంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మకర్తల సేవా సమితి అధ్యక్షుడు చిందం నరసయ్య, సభ్యులు గడప శేఖర్, సల్ల రాజయ్య, సిరిపురం శ్రీనివాస్, ఐతం వెంకన్న, బూట్ల కరుణాకర్, రాజేందర్, సుధాకర్ రెడ్డి, రాజిరెడ్డి, బైరి లక్ష్మయ్య, యమా సాగర్, కొత్తూరి శ్రీనివాస్, చిందం అంజి, మృత్యుంజయం, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.


