అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కాకతీయ,శంకరపట్నం:మండలంలో చల్లూరు గ్రామానికి చెందిన అలకుంట్ల వెంకటేష్ అనే వ్యక్తి గురువారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బొలెరో వాహనాన్ని ఉపయోగిస్తూ ఎవరికీ తెలియకుండా ఇసుక తరలిస్తున్న సమయంలో ముత్తారం గ్రామ శివారులో పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


