ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి
కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్
కాకతీయ, నర్సంపేట టౌన్: తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్ ఆకాంక్షించారు. ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా మరింత కృషి చేస్తామని తెలిపారు. నర్సంపేట పట్టణం, నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం అందరికీ శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు.


