రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కాకతీయ, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక కార్పొరేట్ విధానాలపై రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపునిచ్చారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల, పట్టణ 4వ మహాసభలు మోకు దేవేందర్ రెడ్డి, ఆముదాల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మూడ్ శోభన్ మాట్లాడుతూ.. అమెరికా ఇజ్రాయిల్ నిర్వహిస్తున్న ఇరాన్ పై యుద్ధం కారణంగా భారతదేశ రైతాంగం, సాధారణ ప్రజానీకం అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాలకు భారత ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు వల్ల నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పైర్ అయ్యారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం మండల, టౌన్ కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడిగా కృష్ణారెడ్డి, బెజాడి మల్లారెడ్డి, ఆముదాల నర్సిరెడ్డి ,తుప్పతి రాజు, బోడిగం నర్సిరెడ్డి, నాగపురి కనకయ్య ,కొంగరి చంద్ర మజుందార్, సుర్ణ తిరుపతి, ఎస్ డి ఇబ్రహీం, నంగి మైసయ్య, కందూరు శ్రవణ్, కర్ణాకర్, శ్రీకాంత్, పండుగ యాదగిరి, మోకు ఇంద్రం, కర్రె సత్తయ్య, ఎస్ డి ఇస్మాయిల్, ఆవుల చంద్రయ్య, ఎలా సెంబయ్య ముస్త్యాల ప్రభాకర్, కత్తుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


