ప్రజా సంక్షేమమే లక్ష్యం
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి
కాంగ్రెస్లోకి చేరికలు
కాకతీయ, పెద్దవంగర : ప్రజా సంక్షేమమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, ఇది చూసి ఓర్వలేని బిఆర్ఎస్ లేనిపోని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంతకు ముందు పెద్దవంగర మండలం, పోచంపల్లి, కన్వాయగూడెం గ్రామ బీఆర్ఎస్ పార్టీకు చెందిన కుందురు వర ప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాగాని యకలక్ష్మి మనహర్,ఆంజనేయులు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాసల వెంకన్న, బిసి సెల్ అధ్యక్షులు సుధాగాని సతీష్, నాయకులు బేల్లంకొండ మహేందర్, బొమ్మెర మల్లయ్య సుధాగాని అంజన్న, తాండల సోమయ్య, కర్ర అశోక్ రెడ్డి, మద్దెల నరేష్,సోమయ్య, కొమురయ్య, సైదులు,శ్రీనివాస్, నరేష్ తదితరులు కాగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి కండువాకప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.


