ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవసరం
* ముస్త్యాల ప్రధానోపాధ్యాయులు పద్మలత
కాకతీయ, చేర్యాల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవసరం అని ముస్త్యాల జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెచ్ఎం సంగీతం పద్మలత అన్నారు. పాఠశాలలోని ప్రధాన దారికి రెండు పిల్లర్లతో సహా గేట్లు నిర్మాణానికి రూ, 1,50,000 లతో నిర్మించిన ఎన్ఆర్ఐ పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డి ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ..దాతలు ఇదేవిధమైన సహకారం అందించడం ద్వారా విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు.ఈ సందర్భంగా పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డి మాట్లాడుతూ. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలిపితే పరిష్కరిస్తానని చెప్పారు. 22 ఏండ్లుగా పాఠశాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్న ప్రతాప్ బాలమణి రెడ్డిలను పలువురు ప్రశంసిస్తున్నారు.పాఠశాల అభివృద్ధికి ఎన్ఆర్ఐ చేయూతనిస్తుండగా, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు.ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డీలను అభినందించారు.


