గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
కాకతీయ, పెద్దవంగర :పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సర్పంచ్ గుగులోత్ కవితయాకన్న,డాక్టర్ సంధ్య అన్నారు. బుధవారం మోత్య తండ గ్రామంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల వేసి మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి అన్నారు. ఈ వ్యాధి వస్తే చూడి పశువులకు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ, ఎద్దులు దుక్కి దున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


