సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్లోని ప్రభుత్వ స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, టీఎస్కేసీ సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఇతర పోటీ పరీక్షల వ్యూహాలు అనే అంశంపై మంగళవారం ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా హాజరైన పేస్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. డిగ్రీ రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే తమ కెరీర్పై దృష్టి సారించి సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే విజయం సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. సమయపాలన, క్రమశిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలు విజయానికి కీలకమని ఆయన వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధ్యాపకులు, టీఎస్కేసీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


